శ్రీమాత్రే నమః
శ్రీమంత్రమాతృకా పుష్పమాలాత్మక నిత్యమానసికపూజ
శ్రీ శంకర భగవత్పాదాచార్య విరచిత శ్రీ మంత్రమాతృకా పుష్పమాలాత్మక నిత్యమానస పూజ
శ్రీలలితా త్రిపురసుందరిని పంచోపచారాలు, షోడశోపచారాలు, లేదా చతుష్షష్టి ఉపచార పూజ అంటే, 64 ఉపచారాలతో సేవిస్తూ ఉంటాము. శ్రీ మంత్ర మాతృకా పుష్పమాలా స్తవం ద్వారా శ్రీ శంకర భగవత్పాదులవారు నిత్యము అమ్మవారిని మానసికంగా ఎలా షోడశ ఉపచారాలతో పూజించవచ్చో మనకు తెలియ జెప్పారు. ఈ మంత్రమాతృకా పుష్పమాలలో 17 శ్లోకాలు ఉన్నాయి. అందులో 16 శ్లోకాలు 16 ఉపచారాలకు గాను, ఆఖరి శ్లోకం ఫలస్తుతి గాను చెప్పబడింది.
ఈ స్తోత్రంలో దాగి వున్న ఒక మహత్తరమైన విషయం ఏమిటంటే, ఈ స్తోత్రం పఠిస్తే పంచదశీ, షోడశీ మంత్రాలు చేసిన ఫలితం వస్తుంది. ఈ శ్రీ మంత్ర మాతృకా పుష్పమాలా స్తవం ఆ విధంగా గుప్తంగా పంచదశీ, షోడశీ మంత్రాలకు అనుసంధానంగా చెప్పబడింది. మొదటి పదిహేను శ్లోకాలలో మొదటి అక్షరాలు కలిపి వరుసగా చదివితే పంచదశీ మంత్రం వస్తుంది. పదహారవ శ్లోకం లోని మొదటి అక్షరం కూడా కలిపి చదివితే షోడశీ మంత్రం వస్తుంది. బీజాక్షరములను చదవలేనివారు ఈ స్తోత్రాన్ని చదువుకుంటే, పంచదశీ, షోడశీ మంత్రములు జపం చేసిన ఫలితం లభిస్తుంది. గురుముఖతః ఉపదేశం లేనివారు కూడా ఈ స్తోత్రాన్ని చదువుకుంటే, ఆ మంత్రాలను జపించిన ఫలితం పొందుతారు.
(ఉదాహరణకు క..కల్లోలోల్ల, ఏ...ఏణాంకానల, ఈ...ఈశనాది, ల...లక్ష్యే, హ్రీం... హ్రీంకారాంకిత ..... మొదలైన మొదటి అక్షరములు కలిపి చదివితే మొదటి పదిహేను శ్లోకాలలో పంచదశి, పదహారు శ్లోకాలలో షోడశీ మంత్రాలు వస్తాయి.)
ప్రశాంతంగా సుఖాసనములో కూర్చుని ఈ శ్రీ మంత్రమాతృకా పుష్పమాలను పఠిస్తూ, మనస్సనే మందిరంలో అమ్మవారిని ఆవాహన చేసి, ఈ విధంగా షోడశ ఉపచారాలు చేస్తున్నట్టు భావన చేస్తూ వుంటే, ఆ జగన్మాత కరుణా కటాక్షము లభించి, మనస్సుకు శాంతి, ఆనందం, స్వస్థత చేకూరుతాయి.
శ్రీ మంత్రమాతృకా పుష్పమాలా స్తవం ప్రతినిత్యము సంధ్యాసమయములో ఎవరైతే స్తుతిస్తారో వారి సర్వ అభీష్టాలు సిద్ధిస్తాయి. ముందుగా మీకు నచ్చిన ధ్యానశ్లోకం ఒకటి చదువుకుని ప్రారంభించండి.
*****************************
ధ్యానం
అరుణామ్ కరుణా తరంగితాక్షీమ్ ధృతపాశాంకుశ పుష్పబాణ చాపామ్
అణిమాదిభిః ఆవృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీమ్
🌿🌿🌿
స్తోత్రం
కల్లోలోల్ల సితామృతాబ్ధి లహరీ మధ్యే విరాజన్మణి
ద్వీపే కల్పకవాటికా పరివృతే కాదమ్బవాట్యుజ్జ్వలే ।
రత్నస్తంభ సహస్ర నిర్మిత సభామధ్యే విమానోత్తమే
చింతారత్న వినిర్మితం జనని తే సింహాసనం భావయే ॥ 1 ॥
జననీ! శ్రీ లలితాపరాభట్టారికా! నా మనస్సనే అమృతసముద్రములో, ఆ అలల మధ్యలో, నా కల్పనలో విరాజిల్లుతున్న మణిద్వీపములో, ఉజ్జ్వలంగా ప్రకాశిస్తున్న కదంబవృక్షముల తోటలో, రత్నస్తంభములతో నిర్మించబడిన సభామధ్యములో, ఉన్నతమైన, ఉత్తమమైన చింతామణులతో ఏర్పరచిన విమాన సమాన సింహాసనంపై నిన్ను ఆవాహనము చేస్తున్నట్టు భావిస్తున్నాను తల్లీ.
ఏణాంకానల భానుమండల లసత్ శ్రీచక్ర మధ్యే స్థితాం
బాలార్క ద్యుతి భాసురాం కరతలైః పాశాంకుశౌ బిభ్రతీమ్ ।
చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభ వస్త్రాన్వితాం
తాం త్వాం చంద్రకలావతంస మకుటాం చారుస్మితాం భావయే ॥ 2 ॥
బాలార్క ద్యుతి భాసురాం కరతలైః పాశాంకుశౌ బిభ్రతీమ్ ।
చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభ వస్త్రాన్వితాం
తాం త్వాం చంద్రకలావతంస మకుటాం చారుస్మితాం భావయే ॥ 2 ॥
శ్రీమాతా! శ్రీ లలితా! చంద్ర, అగ్ని, సూర్య మండలాల మధ్యలో మహా ప్రకాశవంతముగా వున్న శ్రీచక్ర మధ్యములో ఆసీనురాలవై, అప్పుడే ఉదయించిన లేలేత భానుడి వంటి కాంతితో మెరిసిపోతూ, చేతిలో పాశము, అంకుశము కలిగి వున్న నిన్ను నా మనసుతో చూస్తున్నానమ్మా. ఇంకా చాపము, బాణము పట్టుకుని ఎర్రని వస్త్రములతో, ప్రసన్నవదనముతో, చంద్రకళను శిరస్సున మకుటముగా ధరించి చక్కని మనోహరమైన చిరునగవుతో ఉన్న నిన్ను దర్శిస్తున్నట్టు ధ్యానిస్తున్నానమ్మా.
ఈశనాది పదం శివైక ఫలదం రత్నాసనం తే శుభం
పాద్యం కుంకుమ చందనాది భరితైః అర్ఘ్యం సరత్నాక్షతైః ।
శుద్ధై రాచమనీయకం తవ జలైః భక్త్యా మయా కల్పితం
కారుణ్యామృత వారిధే తదఖిలం సంతుష్టయే కల్పతామ్ ॥ 3 ॥
అమ్మా! జగదంబా! బ్రహ్మ, గోవిందుడు, రుద్రుడు, ఈశ్వరుడు పాదములుగా, సదాశివుడు ఫలకముగా శుభస్కరమైన రత్నములతో అమర్చిన ఆసనాన్ని నా కల్పనలో నీకు సమర్పిస్తున్నాను. కుంకుమపువ్వు, చందనము కలిపిన ఈ ఉదకమును నీ పాదములు కడుగుటకు పాద్యముగానూ, రత్నాక్షతలతో కూడిన ఈ నీటిని నీ హస్తములు కడుగుటకు అర్ఘ్యముగానూ, ఈ శుద్ధమైన జలము నీకు ఆచమనీయం కొరకూ, నా మానసములో భక్తితో నీకు అర్పిస్తున్నానమ్మా. ఓ దయామృత వారిధీ, ఈ సేవలన్నీ నీకు సంతోషమును కలిగించాయని నా మనసులో తలపోస్తున్నాను తల్లీ.
లక్ష్యే యోగిజనస్య రక్షిత జగజ్జాలే విశాలేక్షణే
ప్రాలేయాంబు పటీర కుంకుమ లసత్ కర్పూర మిశ్రోదకైః ।
గోక్షీరైరపి నారికేల సలిలైః శుద్ధోదకైః మంత్రితైః
స్నానం దేవి ధియామయై తదఖిలం సంతుష్టయే కల్పతామ్ ॥ 4 ॥
ప్రాలేయాంబు పటీర కుంకుమ లసత్ కర్పూర మిశ్రోదకైః ।
గోక్షీరైరపి నారికేల సలిలైః శుద్ధోదకైః మంత్రితైః
స్నానం దేవి ధియామయై తదఖిలం సంతుష్టయే కల్పతామ్ ॥ 4 ॥
లక్షల మంది యోగిజనులను, ఈ జగజ్జాలము నంతనూ నీ విశాలనయనములతో రక్షిస్తున్న ఓ శ్రీమాతా! చందనము, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరము కలిపి చల్లగా ప్రకాశించే జలములను, గోక్షీరము, నారికేళజలము, మరియు మంత్రపూతమైన శుద్ధోదకమును నీకు స్నానార్థం భక్తిగా సమర్పిస్తున్నట్టు భావిస్తున్నానమ్మా. ఈ అభిషేకసేవతో సంతుష్టురాలైన నిన్ను నా మనోనేత్రంతో దర్శిస్తున్నానమ్మా.
హ్రీంకారాంకిత మంత్ర లక్షిత తనో హేమాచలాత్సంచితైః
రత్నైరుజ్జ్వల ముత్తరీయ సహితం కౌసుంభ వర్ణాంశుకమ్ ।
ముక్తా సంతతి యజ్ఞసూత్ర మమలం సౌవర్ణ తంతూ ద్భవం
దత్తం దేవి ధియామయై తదఖిలం సంతుష్టయే కల్పతామ్ ॥ 5 ॥
రత్నైరుజ్జ్వల ముత్తరీయ సహితం కౌసుంభ వర్ణాంశుకమ్ ।
ముక్తా సంతతి యజ్ఞసూత్ర మమలం సౌవర్ణ తంతూ ద్భవం
దత్తం దేవి ధియామయై తదఖిలం సంతుష్టయే కల్పతామ్ ॥ 5 ॥
హ్రీంకారమనే మంత్రాక్షర స్వరూపమైన, రూపుదాల్చిన బంగరుకొండ వలె దర్శనం ఇస్తున్న ఓ శ్రీదేవీ! ఎర్రని వర్ణముతో, ఉజ్వలమైన రత్నములతో పొదిగిన ఉత్తరీయమును నీకు సమర్పిస్తున్నట్టు భావిస్తున్నాను తల్లీ. నా మానసమనెడు సరోవరంలో ఉద్భవించిన స్వచ్ఛమైన ముత్యములను, బంగారుతీగలో గుది గుచ్చిన ఈ యజ్ఞసూత్రమును మనస్ఫూర్తిగా నీకు ధరింపచేస్తున్నట్టు నా ఊహలో కల్పిస్తున్నానమ్మా. ఆ వస్త్రమును, యజ్ఞోపవీతమునూ నువ్వు సంతోషముగా ధరించి నన్ను ఆనందపరిచినట్టు నేను కల్పన చేస్తున్నాను తల్లీ.
హంసైరప్యతి లోభనీయ గమనే హారావలీ ముజ్జ్వలాం
హిందోల ద్యుతి హీరపూరిత తరే హేమాంగదే కంకణే ।
మంజీరౌ మణికుండలే మకుట మప్యర్ధేందు చూడామణిం
నాసా మౌక్తిక మంగులీయ కటకౌ కాంచీమపి స్వీకురు ॥ 6 ॥
మంజీరౌ మణికుండలే మకుట మప్యర్ధేందు చూడామణిం
నాసా మౌక్తిక మంగులీయ కటకౌ కాంచీమపి స్వీకురు ॥ 6 ॥
హంసలు కూడా అసూయ చెందే చక్కని మందగమనం కల ఓ తల్లీ! ప్రకాశవంతముగా భాసిస్తున్న హారములు, వజ్రములు రత్నములు పొదిగి ధగధగా మెరుస్తున్న ఆందోళికమును, మంచి బంగారుతో చేయబడిన భుజకీర్తులు, కంకణములు, ఘల్లుఘల్లుమనే మంజీరములు, మణికుండలములు, కిరీటము, దానిపై అర్ధచంద్ర చూడామణి, మంచిముత్యం వేలాడుతున్న ముక్కుబులాకీ, మేలైన ఉంగరములు, నడుమును చుట్టి ఉండే వడ్డాణము వంటి ఆభరణములను నీకు సమర్పిస్తున్నట్టు నేను కల్పన చేస్తున్నాను, స్వీకరించి కటాక్షించవమ్మా.
సర్వాంగే ఘనసార కుంకుమ ఘన శ్రీగంధ పంకాంకితం
కస్తూరీ తిలకంచ ఫాలఫలకే గోరోచనా పత్రకమ్ ।
గండా దర్శన మండలే నయనయో ర్దివ్యాంజనం తేంచితం
కంఠాబ్జే మృగనాభి పంక మమలం త్వత్ప్రీతయే కల్పతామ్ ॥ 7 ॥
కస్తూరీ తిలకంచ ఫాలఫలకే గోరోచనా పత్రకమ్ ।
కంఠాబ్జే మృగనాభి పంక మమలం త్వత్ప్రీతయే కల్పతామ్ ॥ 7 ॥
ఓ జగన్మాతా! లావణ్యశేవధీ! నీ సర్వాంగములకూ పచ్చకర్పూరం, కుంకుమపువ్వు కలిపిన శ్రీచందనపు ముద్దను నలుగు అద్దుతున్నట్టుగా భావన చేస్తున్నానమ్మా. నీ ఫాలఫలకంపై కస్తూరీ తిలకాన్ని దిద్ది, ఆ తిలకముపై, గోవు నుంచి సేకరించిన గోరోజనపు పొరలను అద్దుతున్నానమ్మా. చక్కనైన నీ కన్నులకు మహత్తరమైన దివ్య అంజనమును అద్దుతున్నట్టు ధ్యానిస్తున్నానమ్మా. నీ కంఠ కమలానికి కస్తూరీమృగం నాభి నుంచి వెలువడిన అమలమైన కస్తూరిని నీ ప్రీతి కొరకు సమర్పిస్తున్న భావన చేస్తున్నాను తల్లీ.
కల్హారోత్పల మల్లికా మరువకైః సౌవర్ణ పంకేరుహై-
ర్జాతీ చంపక మాలతీ వకులకైః మందార కుందాదిభిః ।
కేతక్యా కరవీరకైః బహువిధైః క్లుప్తాః స్రజో మాలికాః
సంకల్పేన సమర్పయామి వరదే సంతుష్టయే గృహ్యతామ్ ॥ 8 ॥
కేతక్యా కరవీరకైః బహువిధైః క్లుప్తాః స్రజో మాలికాః
సంకల్పేన సమర్పయామి వరదే సంతుష్టయే గృహ్యతామ్ ॥ 8 ॥
ఓ వరదాయినీ! ఎర్రకలువ, పద్మము, మల్లెలు, మరువము, బంగారువర్ణపు పచ్చకమలాలు, జాజిపువ్వులు, సంపెంగలు, మాలతీ, పొగడలు, మందారములు, మొల్లలు, మొగలి, గన్నేరు, వంటి బహువిధములైన సౌగంధిక పుష్పముల మాలను గుత్తుగా అల్లి నిన్ను సంతుష్టపరచుటకై సమర్పించు సంకల్పము చేస్తున్నాను.సంతోషముగా ఈ సౌగంధికా పుష్పమాలను గ్రహించమ్మా.
హంతారం మదనస్య నందయసి యైరంగై రనంగోజ్జ్వలై,
తానీమాని తవాంబ కోమల తరాణ్యామోద లీలా గృహా-
ణ్యామోదాయ దశాంగ గుగ్గులు ఘృతై ర్ధూపై రహం ధూపయే ॥ 9 ॥
ఓ భ్రమరాంబా! తన వహ్నినేత్రముతో మదనుని సంహరించిన వానికి ఆనందమును చేకూర్చు ఓ తల్లీ! కృపతో ఆ అనంగుడికి తిరిగి ప్రాణం పోసిన కరుణామయీ, సమస్త పరిమళాల సుగంధమూ కలిగి, తుమ్మెద రెక్కల వలె గుత్తులు గుత్తులుగా, మెత్తగా పట్టుకుచ్చు వలె, పొడవుగా వుండే నీ నల్లని కురులకు సింగారముగా పదివిధములైన సుగంధద్రవ్యములు కలిపిన దశాంగమును, గుగ్గిలద్రవమును నేతితో కలిపి ధూపం వేస్తున్నట్టు భావన చేస్తున్నాను తల్లీ.
లక్ష్మీ ముజ్జ్వలయామి రత్ననివహో ద్భాస్వత్తరే మందిరే
మాలారూప విలంబితైః మణిమయ స్తంభేషు సంభావితైః ।
చిత్రైర్హాటక పుత్రికా కరధృతైః గవ్యై ర్ఘృతై ర్వర్ధితైః
దివ్యై ర్దీపగణై ర్ధియా గిరిసుతే సంతుష్టయే కల్పతామ్ ॥ 10 ॥
మాలారూప విలంబితైః మణిమయ స్తంభేషు సంభావితైః ।
చిత్రైర్హాటక పుత్రికా కరధృతైః గవ్యై ర్ఘృతై ర్వర్ధితైః
దివ్యై ర్దీపగణై ర్ధియా గిరిసుతే సంతుష్టయే కల్పతామ్ ॥ 10 ॥
ఓ గిరిసుతా! ఉజ్వలముగా ప్రకాశించుచున్న రత్న మందిరములో, మణిమయ స్తంభాలన్నీ వరుసగా బారులు బారులుగా అమరివున్న మంటపములో, ఆ స్తంభాల వద్ద బంగారు బొమ్మలు తమ చేతులలో ప్రవర్ధనంగా వెలుగుతున్న దివ్యమైన ఆవునేతి దీపములు నీకొరకై తమ బంగరుచేతులు చాచి చూపిస్తున్నట్టుగా సంతోషముగా కల్పన చేస్తున్నాను తల్లీ.
హ్రీంకారేశ్వరి తప్తహాటక కృతైః స్థాలీ సహస్రై ర్భృతం
దివ్యాన్నం ఘృత సూప శాక భరితం చిత్రాన్న భేదం తథా ।
దుగ్ధాన్నం మధు శర్కరా దధియుతం మాణిక్యపాత్రే స్థితం
మాషాపూప సహస్రమంబ సఫలం నైవేద్య మావేదయే ॥ 11 ॥
దివ్యాన్నం ఘృత సూప శాక భరితం చిత్రాన్న భేదం తథా ।
దుగ్ధాన్నం మధు శర్కరా దధియుతం మాణిక్యపాత్రే స్థితం
మాషాపూప సహస్రమంబ సఫలం నైవేద్య మావేదయే ॥ 11 ॥
ఓ హ్రీంకార రూపా! శ్రీదేవీ! నీ నైవేద్యము కొరకై, బాగుగా కాల్చి చేసిన సహస్ర స్వర్ణపాత్రలను దివ్యాన్నము, నేయి వేసి వండిన ముద్దపప్పు, బహువిధములైన శాకములు, చిత్రాన్నములు, నింపి ఉంచానమ్మా. పాలతో వండిన పాయసాన్నము, తేనె, పంచదార, పెరుగు, నెయ్యి, పాలు వంటి పంచామృతములు, వెయ్యి నేతి మినపగారెలు, ఫలములతో పాటు మాణిక్య పాత్రలలో సిద్ధం చేసి నీకు నైవేద్యం సమర్పిస్తున్నట్టు కల్పన చేస్తున్నానమ్మా. సంతోషముగా స్వీకరించవమ్మా.
సచ్ఛాయైర్వర కేతకీదల రుచా తాంబూలవల్లీ దలైః
పూగై ర్భూరిగుణైః సుగంధి మధురైః కర్పూర ఖండోజ్జ్వలైః ।
ముక్తాచూర్ణ విరాజితైః బహువిధైః వక్త్రాంబుజా మోదనైః
పూర్ణా రత్నకలాచికా తవ ముదేన్యస్తా పురస్తాదుమే ॥ 12 ॥
పూగై ర్భూరిగుణైః సుగంధి మధురైః కర్పూర ఖండోజ్జ్వలైః ।
ముక్తాచూర్ణ విరాజితైః బహువిధైః వక్త్రాంబుజా మోదనైః
పూర్ణా రత్నకలాచికా తవ ముదేన్యస్తా పురస్తాదుమే ॥ 12 ॥
అంబా! కరుణామయీ! నీకు భోజనానంతరం తాంబూలము సమర్పించుటకై స్వచ్ఛమైన మొగలిరేకుల వంటి కాంతితో మెరిసే తమలపాకులు, జీర్ణమునకు ఉపయోగపడే గొప్ప గుణములు కల పూగీఫలము (వక్కలు), మధురమైన సుగంధములుకల పచ్చకర్పూరపు పలుకులు, మంచి ముత్యములను కాల్చి పొడి చేసిన ముక్తాచూర్ణము, బహువిధములైన ఇతర సుగంధ ద్రవ్యములు కలిపి నీ నోటికి ఆమోదముగా ఉండే విధంగా తాంబూలము సిద్ధము చేసి సమర్పిస్తున్నట్టు భావిస్తున్నాను జననీ. పక్కనే నీ తాంబూల శేషము కొరకై ఒక రత్నపాత్రను ఉంచుతున్నానమ్మా, మాపై దయతో నీ తాంబూల ప్రసాదమును కొద్దిగా ఈ రత్నపాత్రలో ప్రసాదించు తల్లీ.
కన్యాభిః కమనీయ కాంతిభిః అలంకారామలారార్తికా
పాత్రే మౌక్తిక చిత్ర పంక్తి విలసత్ కర్పూర దీపాలిభిః ।
తత్తత్తాల మృదంగ గీత సహితం నృత్య త్పదాంభోరుహం
మంత్రారాధన పూర్వకం సువిహితం నీరాజనం గృహ్యతామ్ ॥ 13 ॥
పాత్రే మౌక్తిక చిత్ర పంక్తి విలసత్ కర్పూర దీపాలిభిః ।
తత్తత్తాల మృదంగ గీత సహితం నృత్య త్పదాంభోరుహం
మంత్రారాధన పూర్వకం సువిహితం నీరాజనం గృహ్యతామ్ ॥ 13 ॥
ఓ సర్వమంగళా! ఓ జగజ్జననీ! నీకు మంగళహారతు లెత్తుటకై చక్కని కన్యలు, కన్నులకింపైన అలంకారములతో, ముత్యములతో చిత్రముగా అలంకరించి వున్న పాత్రలలో, కర్పూరదీపాలను పట్టుకుని వరుసగా నిలబడి ఉన్నారమ్మా. తాళములు, మృదంగములు, గీతములు, నృత్యములు, మంత్రపూర్వక ఆరాధన సహితముగా నీ పాద పద్మములకు నీరాజనము సమర్పిస్తున్నట్టు కల్పన చేస్తున్నానమ్మా, కృపతో గ్రహించవమ్మా.
లక్ష్మీ ర్మౌక్తిక లక్ష కల్పిత సితచ్ఛత్త్రం తు ధత్తే రసా-
దింద్రాణీ చ రతిశ్చ చామరవరే ధత్తే స్వయం భారతీ ।
వీణా మేణ విలోచనాః సుమనసాం నృత్యంతి తద్రాగవ-
ద్భావై రాంగిక సాత్త్వికైః స్ఫుటరసం మాత స్తదా కర్ణ్యతామ్ ॥ 14 ॥
వీణా మేణ విలోచనాః సుమనసాం నృత్యంతి తద్రాగవ-
ఓ జగన్మాతా! కరుణాసముద్రా! లక్ష్మీకరములైన లక్ష మంచి ముత్యములను కుట్టిన ఛత్రమును భావనతో నీసేవలో సమర్పిస్తున్నానమ్మా. నీకు అటునిటు ఇంద్రాణి, రతీదేవి మెల్లగా చామరములు వీస్తున్నట్టు దర్శిస్తున్నానమ్మా. స్వయముగా భారతీదేవి వీణ వాయిస్తూ గానము చేస్తుంటే, సుమనస్కులైన అప్సర స్త్రీలు నీచుట్టూ ఆంగిక సాత్విక అభినయంతో నృత్యం చేస్తున్నట్టు కల్పిస్తున్నానమ్మా. వారు చేసున్న ఆ శబ్దాలతో నా చెవులలో ఉన్న మలినము తొలిగిపోయిన భావన కలుగుతోంది తల్లీ.
హ్రీంకారత్రయ సంపుటేన మనునోపాస్యే త్రయీ మౌలిభిః
వాక్యై ర్లక్ష్యతనో తవ స్తుతివిధౌ కో వా క్షమేతామ్బికే ।
సల్లాపాః స్తుతయః ప్రదక్షిణ శతం సంచార ఏ వాస్తు తే
సంవేశో నమసః సహస్రమఖిలం త్వత్ప్రీతయే కల్పతామ్ ॥ 15 ॥
సల్లాపాః స్తుతయః ప్రదక్షిణ శతం సంచార ఏ వాస్తు తే
సంవేశో నమసః సహస్రమఖిలం త్వత్ప్రీతయే కల్పతామ్ ॥ 15 ॥
ఓ వేదజననీ! వేదవేద్యా! మనువు ఉపాసించిన హ్రీంకారేశ్వరీ. మూడు వేదములూ శిరస్సుగా కలిగివున్న నిన్ను ఎలా స్తుతించాలో కూడా నాకు తెలియదు. క్షమించు తల్లీ. ఎల్లప్పుడూ నా తలంపులో ఉన్న వాక్యములు, నీతో జరుపుతున్న ఈ సల్లాపములనే నీ స్తుతులుగా తలచవమ్మా. అన్నివేళలా, అంతటా నిండి ఉన్న తల్లీ, నేను చేసే సంచారమంతయూ నీ పీఠము చుట్టూ నేను చేస్తున్న వంద ప్రదక్షిణములుగా అనుకోవమ్మా. నేను చేసే ప్రతి సంకల్పమూ, ప్రతి కార్యమూ సహస్ర నమస్సులు నీ ప్రీతి కొరకై అర్పిస్తున్నట్టుగా భావించమ్మా.
శ్రీమంత్రాక్షరమాలయా గిరిసుతాం యః పూజయేంచేతసా
సంధ్యాసు ప్రతివాసరం సునియతస్త స్యామలం స్యాన్మనః ।
చిత్తాంభోరుహ మంటపే గిరిసుతా నృత్తం విధత్తేరసా-
ద్వాణీ వక్త్ర సరోరుహే జలధిజా గేహే జగన్మంగలా ॥ 16 ॥
చిత్తాంభోరుహ మంటపే గిరిసుతా నృత్తం విధత్తేరసా-
ద్వాణీ వక్త్ర సరోరుహే జలధిజా గేహే జగన్మంగలా ॥ 16 ॥
నిర్మలమైన మనసుతో, నియమముగా ప్రతిదినం సంధ్యాసమయాల్లో ఈ శ్రీమంత్రాక్షరమాలతో హిమవత్పుత్రిని మానసిక పూజతో సేవిస్తే, ఆ విజయ, ఆ వందారు జనవత్సల వారి మానసపద్మపీఠంపై ఆనందతాండవం చేస్తుంది. వారి వాక్కులో సరస్వతి కొలువై ఉంటుంది. వారి గృహములలో శ్రీమహాలక్ష్మి జగన్మంగళముగా నివసిస్తుంది.
ఇతి గిరివరపుత్రీ పాద రాజీవ భూషా
భువన మమలయంతీ సూక్తి సౌరభ్య సారైః ।
శివ పద మకరంద స్యందినీయం నిబద్ధా
మదయతు కవి భృంగా న్మాతృకా పుష్పమాలా ॥ 17 ॥
భువన మమలయంతీ సూక్తి సౌరభ్య సారైః ।
శివ పద మకరంద స్యందినీయం నిబద్ధా
మదయతు కవి భృంగా న్మాతృకా పుష్పమాలా ॥ 17 ॥
ఈ మంత్రమాతృకా పుష్పమాల ఆ శ్రీమాత పాదపద్మాలకు మంజీరములు గాను,
నిర్మలమైన సుభాషితసారమై అన్ని భువనములలోనూ జ్ఞాన సుగంధము గాను,
భక్తులను పరమశివ పదాంబుజముల మకరంద ధారకు బద్ధులు గాను,
జ్ఞానులకు, కవులకు, ఆనందమును కూర్చునది గాను, అగుగాక!!!
ఇతి శ్రీమచ్ఛంకర భగవత్పాద విరచితః
మంత్ర మాతృకా పుష్పమాలా స్తవః సమ్పూర్ణః ॥
శ్రీ శంకర భగవత్పాదులు రచించిన ఈ మంత్రమాతృకా పుష్పమాలా స్తవం సంపూర్ణం
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి