జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా ॥ 27 ॥
లలిత తన అహంకారము నుంచి వారాహీదేవిని సృష్టించింది. ఈ వారాహిని తన సైన్యానికి
దండనాథగా నియమించింది. దండనాథ కిరిచక్రమనే రథమును అధిష్టించి వున్నది.
లలితాసహస్రనామస్తోత్రంలో మూడవ రథం కిరిచక్రరథం. విశాలమైనది, ఉన్నతమైనది.
కిరి అంటే వరాహము. వరాహములచే లాగబడుతున్న రథమును ఎక్కి వారాహీ దేవి
దండనాథయై అమ్మను సేవించుచున్నది అని ఈ నామానికి అర్ధం.
ఈమె లలితాసైన్యానికి దండమును ధరించి ఆదేశములను ఇస్తూ ఉంటుంది.
కిరి అంటే కిరణము అనే అర్ధం కూడా వున్నది.
ఈ కిరి చక్రము నుంచి ప్రసరించే కిరణములే, ఈ భూమండలమంతా ఆవరించి వున్నవి.
వరాహశక్తి అనగా, భూమండలమును ఉద్ధరించు శక్తి. జీవుడు మార్గము తప్పినప్పుడు,
ఈ వరాహశక్తి తన కిరణములలో జీవుని బంధించి పతనమవకుండా ఉద్ధరిస్తుంది.
దండించటానికీ, ఉద్ధరించటానికీ ఈ వరాహశక్తియే అధిదేవత.
ఈ వారాహీ దేవతను ధ్యానిస్తే, జీవుడు పతనమవకుండా కాపాడబడతాడు.
ఆత్మజ్ఞానమును పొంది సదాశివ తత్వంలో రమిస్తాడు.
కిరిచక్రమనే రథమును ఎక్కి, దండనాథ అయిన వారాహీదేవిచే పూజింపబడుతున్న
ఆ కిరిచక్రరథారూఢదండనాథాపురస్కృత కు వందనం.
ఓం శ్రీ కిరిచక్రరథారూఢదండనాథాపురస్కృతాయై నమః
ఆ జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకారమధ్యగ కు వందనం.
ఓం శ్రీ జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకారమధ్యగాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి