విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా
కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా ॥ 30 ॥
76. విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా
తదనంతర యుద్ధంలో దండనాథ అయిన వారాహీదేవి విశుక్రుణ్ణి సంహరించింది.
విశుక్రుడు, భండాసురుని మరొక సచివుడు, సోదరుడు. ఈ సోదరుడు కూడా వారాహీదేవిచే
హతుడయ్యాడు. మహా వీర్య పరాక్రమముతో వారాహీదేవి విశుక్రుడి ప్రాణాన్ని హరించేసింది.
విశుక్రుడు శుక్రాచార్యునితో సమానమైనవాడు. తన తేజస్సును, శక్తిని
విపరీతమైన విషయములకు వాడి ద్వంద్వములో పడిపోయినవాడు.
ఆ జీవుడి ప్రాణశక్తిని హరించి, ఉద్ధరించింది వారాహీ శక్తి.
జీవుడు ఎప్పుడూ రాగము-ద్వేషము, ఆనందము-దుఃఖము, కష్టము-సుఖము
వంటి ద్వందాలలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు.
ఆ స్థితిలో నుంచి జీవుడిని విముక్తుడిని చేయటానికి ఈ శక్తులు ప్రకటితమవుతూ ఉంటాయి.
విషంగ, విశుక్ర వధల వలన భండాసురుడు రెండు భుజములూ తెగినవాడై పోయాడు.
విశుక్రుడు ప్రాణాన్ని హరించిన వారాహీదేవి వీర్య శౌర్యాలకు ఆనందిస్తున్న,
ఆ విశుక్రప్రాణహరణవారాహీవీర్యనందిత కు వందనం.
ఓం శ్రీ విశుక్రప్రాణహరణవారాహీవీర్యనందితాయై నమః
ఓం శ్రీ కామేశ్వరముఖాలోకకల్పితశ్రీగణేశ్వరాయై నమః
ఇక్కడ లలితాసహస్రనామాలలో చెప్పబడిన గణేశోత్పత్తి వివరం చెప్పాను.
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి