మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా
హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ ॥ 108 ॥
524.మజ్జాసంస్థా
మజ్జ ధాతువులో ఉంటూ ఆరోగ్యాన్నిస్తున్న, ఆ మజ్జాసంస్థ కు వందనం.
ఓం శ్రీ మజ్జాసంస్థాయై నమః
525. హంసవతీముఖ్యశక్తిసమన్వితా
ఆజ్ఞాచక్రము లోని పద్మమునకు రెండు దళములు అని చెప్పుకున్నాం కదా.
ఆ రెండు దళములు ఇడా పింగళా నాడులకు సంకేతం.
హ, క్ష, అను రెండు హల్లు అక్షరములచే సూచించబడే హంసవతీ, క్షమావతీ అనే దేవతాశక్తులు,
ఈ రెండు దళములలో వుంటూ, మధ్యలో వున్న ఆజ్ఞాచక్రాబ్జ నిలయను సేవిస్తూ ఉంటాయి.
హ, క్ష అనే అక్షర దేవతా శక్తులచే పూజింపబడే, ఆ హంసవతీముఖ్యశక్తిసమన్విత కు వందనం.
ఓం శ్రీ హంసవతీముఖ్యశక్తిసమన్వితాయై నమః
526. హరిద్రాన్నైక రసికా
హరిద్రాన్నమంటే ఇష్టమైన దేవత. హరిద్రాన్నము అంటే పసుపు కలిపి వండిన పులిహోర,
లేదా చిత్రాన్నము. పచ్చని అన్నమంటే రసజ్ఞత చూపునది ఈ దేవత.
బియ్యము, పసుపు, పులుపు కలిపి అన్నము వండి అమ్మకు నైవేద్యం పెడితే సంతోషిస్తుంది.
పులిహోర అన్నం అంటే ప్రీతి చూపే, ఆ హరిద్రాన్నైక రసిక కు వందనం.
ఓం శ్రీ హరిద్రాన్నైక రసికాయై నమః
గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమ స్థానం ఆఙ్ఞయే.
కూటత్రయముల సంగమస్థానమైన త్రికూటమూ ఆఙ్ఞయే.
సూర్య, చంద్ర, అగ్ని మండలములు కలిసే స్థానం కూడా ఆఙ్ఞయే.
త్రిపురములూ కలిసే స్థానము ఆఙ్ఞ.
రెండు భావనలు, మూడవ భావనతో ఐక్యమయ్యే, సంగమస్థానమే ఆజ్ఞ.
ఈ స్థానము నుంచే ఆజ్ఞలు వస్తాయి. కనుకనే దీనిని ఆజ్ఞా చక్రమని అంటారు.
మూలప్రకృతిని 'హం' అనే బీజాక్షరం తోనూ, మూల పురుషుడిని 'సం' అనే బీజాక్షరం తోనూ
జపిస్తే ఆ జపం సోహం లేదా హంస జపమవుతుంది.
భృకుటి వద్ద ధ్యానమును కేంద్రీకరించి ఓంకారంతో జపం చేస్తే ఫలితం ఉంటుంది.
ఆజ్ఞా చక్ర పద్మములో ఉంటూ, వజ్రము వంటి ధవళవర్ణములో, ఆరు ముఖములతో
వుండే తల్లి హాకినీ రూపధారిణీ. జీవుల ఎముకలలో వుండే మజ్జ అనే ధాతువులో ఉంటూ,
పులిహోర వంటి చిత్రాన్నమును ఇష్టపడుతూ ఉంటుంది.
హంసవతీ, క్షమావతీ అనే అక్షరదేవతా శక్తులచే పూజింపబడుతూ ఉంటుంది.
ఓం శ్రీ హాకినీరూపధారిణ్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి