నిష్కారణా, నిష్కళంకా, నిరుపాధిః, నిరీశ్వరా
నీరాగా, రాగమథనీ, నిర్మదా, మదనాశినీ ॥ 46 ॥
152. నిష్కారణా
అమ్మ ఏ కారణములూ లేనిది. సత్యమైన నిత్యమైన ఆనందము అనుభవించుటకు
ఏ కారణమూ అవసరము లేదు. అమ్మ అటువంటి ఆనందస్వరూపము.
ఆ తల్లిని మనసులో భావించటానికి, భజించటానికీ, ఏ కారణములూ అవసరము లేదు.
ఆమె చిద్రూప. ఏ కారణములూ లేకయే అలరారు మహాశక్తి. ఈ మాతయే అన్నింటికీ కారణము.
తాను మాత్రమూ ఏ కారణమూ లేక వుండే తల్లి. ఆది మధ్యాంత రహిత.
అందుకే ఆ తల్లిని నిష్కారణా అనే నామముతో కీర్తిస్తున్నాము.
ఆ శ్రీదేవిని తలచుకోగానే భక్తులలో కలిగే స్పందనమే ఆ అమ్మ.
ఆ ఆనందమునకు కారణము లేదు. అవధులు వుండవు. ఈ చరాచర సృష్టికి ఆమె కారణభూతము.
ఆ చిత్స్వరూప ఆదేశాలను అనుసరించే సర్వమూ నడుస్తున్నది.
తాను అన్నింటికీ కారణమవుతూ, తాను మాత్రమూ ఏ కారణమూ లేకుండా వుండే,
ఆ నిష్కారణ కు వందనం.
ఓం శ్రీ నిష్కారణాయై నమః
అమ్మవారికి కళంకము లేదు. ఆమె నిత్యశుద్ధ, నిత్యబుద్ధ, శుద్ధవిద్యా స్వరూపిణి.
అమ్మకు మలినములు, మచ్చలు లేవు, కళంకములు లేవు. కనుక ఆమె నిష్కళంక.
కళంకము అంటే, పాపము. ఆ శ్రీ మహారాజ్ఞిని ఏ పాపమూ అంటదు. ఆమె నిష్కళంక.
అమ్మకు ఏ దోషములూ లేవు, ఆమె దోష రహిత. అందువలన ఆ తల్లి నిష్కళంక.
ఆ పరమేశ్వరి ఎటువంటి అజ్ఞానమూ లేని శుద్ధవిద్యా స్వరూపము, అందువలన ఆమె నిష్కళంక.
ఏ భేదభావమూ లేక భక్తులను కాచుకుంటూ, ఏ కళంకమూ లేని, ఆ నిష్కళంక కు వందనం.
ఓం శ్రీ నిష్కళంకాయై నమః
154. నిరుపాధిః
ఆ తల్లి తానే అందరకూ ఉపాధి అవుతోంది కానీ, ఆమె తానుగా నిరుపాధిః,
అంటే ఆ జగజ్జననికి ఏ ఉపాధీ లేదు అని భావం.
మరల ఆ పువ్వును తొలగిస్తే, ఆ అరుణవర్ణం మాయమవుతుంది. అక్కడ ఆ అరుణిమను
ఓం శ్రీ నిరుపాధయే నమః
155. నిరీశ్వరా
సేశ్వర వాదము, నిరీశ్వర వాదము అని రెండు వాదాలున్నాయి.
సేశ్వరవాదము ఈశ్వరుడున్నాడని చెప్తుంది. అమ్మ ఈశ్వరుడు కాదు కనుక, ఆ తల్లి నిరీశ్వర.
నిరీశ్వర వాదము ఈశ్వరుడు లేడు అంటుంది. ఈశ్వరి, ఈశ్వరుడు ఇద్దరికీ అభేదము.
కనుక ఆ తల్లి నిరీశ్వర. ఈ ఈశ్వర, ఈశ్వరీ తత్వములు రెండూ కలిసి వున్న స్వరూపమే
అర్ధనారీశ్వర స్వరూపము. ఈశ్వరి, ఈశ్వరుడు ఇద్దరూ, ప్రకృతి, పురుషుడు.
ప్రకృతి లేనిదే పురుషుడు లేడు, పురుషుడు లేనిదే ప్రకృతి లేదు.
ఈ ఇద్దరూ ఒక్కటే అయినప్పుడు ఎవరికీ ఎవరూ అధిపతి కాదు. ఆ తత్వమే నిరీశ్వర తత్వము.
తానే ఈశ్వరుడు, ఈశ్వరి కనుక, ఇతరమైన దేనినీ, ఎవరినీ ఈశ్వరుడిగా గుర్తించక పోవడమే
నిరీశ్వరతత్వము. కనుక ఆ రాజరాజేశ్వరి నిరీశ్వర.
ఈశ్వరి, ఈశ్వరుడు ఇద్దరూ ఒకటే కనుక, ఆ ఏకత్వ తత్వమే, నిరీశ్వరతత్వము.
స్త్రీ, పురుషులు, ఎక్కువ తక్కువలు, ఏవీ ఆ గుణాతీతమయిన నిరీశ్వరకు చెందవు.
గుణాతీతమైన తత్వానికి ఈశ్వరి, ఈశ్వరుడు అన్న భేదముండదు, కనుక ఆమె నిరీశ్వర.
తనకు తానే ఈశ్వరి అయిన, ఆ నిరీశ్వర కి వందనం.
ఓం శ్రీ నిరీశ్వరాయై నమః
156. నీరాగా
రాగము లేనిది నీరాగ. అమ్మకు రాగద్వేషములు లేవు. అట్టివాటికి అమ్మ అతీతము.
రాగమంటే ఇచ్ఛ, కోరిక, ఆ శ్రీదేవి పూర్ణకామ, నిష్కామ, కనుక ఆమెకు ఏ రాగములూ లేవు.
రాగమనే విషయం సామాన్యులకు సరిపోతుంది కానీ, అన్నీ తన ఇచ్ఛాపూర్వకంగానే
జరుపుతున్న ఆ పరమేశ్వరికి సరిపోదు. ఆమె రాగమునకు అతీతురాలు కనుక నీరాగా అనే
నామము సార్ధకమైనది. కోరికలు లేని దివ్య యోగస్థితి ఎవరికి సాధ్యమో, వారే నీరాగా అని
పిలువబడతారు. ఎల్లప్పుడూ ఆ స్థితిలోనే ఉండే అమ్మ కనుక ఆమె నీరాగా.
రాగమనగా భక్తి, తానే భక్తుల పూజలందుకుంటున్న తల్లి కనుక ఆమెకు రాగము లేదు.
రాగ ద్వేషాలకు అతీతమైన, ఆ రాగ రహిత, విరాగికి, ఆ నీరాగ కు వందనం.
ఓం శ్రీ నీరాగాయై నమః
157. రాగమథనీ
రాగమును మధించి భక్తులకు వైరాగ్యమును ఇచ్చునది కనుక, ఈ తల్లిని రాగమథనీ
అంటున్నాం. వైరాగ్యమంటే, రాగము, అనురాగము లేకుండా ఉండటమే.
రాగద్వేషాలు నిజముగా బంధనములు, క్లేశములు. ఈ రాగము, అనురాగములను, మధించి,
అట్టి బంధములు, కష్టముల నుంచి భక్తులను ఉద్ధరించునది ఈ రాగమథని.
కోరిక వలన రాగము, రాగము వలన బంధము, బంధము వలన బాధ కలుగుతాయి.
ఆ బాధను మధించి వేస్తే, మిగిలేది రాగరహితమైన వైరాగ్యమే.
రాగమును మధనము చేసి తొలగించి వైరాగ్యమును ప్రబోధించే, ఆ రాగమథని కి వందనం.
ఓం శ్రీ రాగమథన్యై నమః
158. నిర్మదా
మదము లేనిది నిర్మద. అమ్మవారికి అరిషడ్వర్గములేవీ అంటవు. వాటిని సృష్టించినదే ఆ తల్లి.
ఆమెకు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములేవీ లేవు కనుక, ఆ తల్లి నిర్మద.
మదములు ఎనిమిది రకములు. అవి అన్నమదము, అర్థమదము, స్త్రీమదము,
విద్యామదము, కులమదము, రూపమదము, ఉద్యోగమదము, యౌవనమదము.
జీవుడిలో మదమును పోగొట్టే శక్తి ఈ నిర్మద. మదము అనేది రాక్షసగుణము.
ఈ తల్లిని భక్తితో ఆరాధించి మదమును పోగొట్టుకోవాలి.
ఒక్కోసారి దేవతలు కూడా గర్వము హెచ్చి మదముకు లొంగిపోతారు.
మదము అనే అవిద్యా రూపాన్ని తొలగించి, జ్ఞానమును కలిగించే, ఆ నిర్మద కు వందనం.
ఓం శ్రీ నిర్మదాయై నమః
159. మదనాశినీ
మదమును నాశము చేసే శక్తి కనుక ఈ అమ్మ మదనాశిని.
మదించిన అసురులను నిర్జించిన ఈ తల్లి మదనాశిని.
అహంకారము, దురభిమానము పెచ్చుమీరినపుడు, తానే ఉన్నతుడని భావము పెరిగినప్పుడు,
మదము తలకి ఎక్కుతుంది. అటువంటి సమయములో అమ్మను భక్తితో సేవిస్తే,
మదము అనే శత్రువును నాశనము చేస్తున్న, ఆ మదనాశిని కి వందనం.
ఓం శ్రీ మదనాశిన్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి