మదఘూర్ణిత రక్తాక్షీ, మదపాటల గండభూః
చందన ద్రవదిగ్ధాంగీ, చాంపేయ కుసుమ ప్రియా ॥ 92 ॥
432. మదఘూర్ణిత రక్తాక్షీ
ఓం శ్రీ మదఘూర్ణితరక్తాక్ష్యై నమః
433. మదపాటల గండభూః
గణ్డభూ అంటే చెక్కిళ్ళు. అమ్మ చెక్కిళ్ళు దర్పణముల వలే స్నిగ్ధంగా, తరళంగా వుంటాయని
తెలుసు కదా. పాటలము అంటే తెలుపుతో కూడిన ఎరుపు అని అర్ధం.
అమ్మ చెక్కిళ్ళు ఎర్రగా ఉంటాయి. ఆ ఎరుపు మదము చే కలిగిన సంతోషము వలన ఏర్పడింది.
పక్కనే తెల్లని శివుడు ఆసీనుడయి ఉండటంతో, కస్తూరి అద్దిన, ఆ అద్దాల్లాంటి చెక్కిళ్ళలో
తెలుపు, ఎరుపు మిశ్రితమై గులాబీ రంగుకి మారాయి.
పక్కనే శివుడున్న అపరిమిత ఆనందంలో అమ్మ చెక్కిళ్ళు ఎర్రబారి వున్నాయి.
పాటలీ కుసుమపత్రాల వలె ఎర్రగా ప్రకాశిస్తున్న బుగ్గలు కల ఆ కామేశ్వరి మధుసేవనం చేత
ఆనందముగా మత్తెక్కి వున్నది. పైగా ఆ కామేశ్వరి నిత్యయౌవనమూర్తి కదా,
యవ్వనంలో ఉన్నవారి చెక్కిళ్ళు సహజంగానే గులాబీ రంగులో ప్రకాశిస్తూ ఉంటాయి.
గులాబీ వర్ణంలో మెరుస్తున్న చెక్కిళ్ళతో విరాజిల్లుతున్న, ఆ మదపాటల గండభు కు వందనం.
ఓం శ్రీ మదపాటలగండభువే నమః
434. చందన ద్రవ దిగ్ధాంగీ
తాపం కలిగినప్పుడు నివారణకు గంధం పూస్తాం. మధుపానం చేసిన కామేశ్వరికి తాపం కలిగింది.
అప్పుడు ఆ తాప ఉపశమనం కోసం, దేహానికి గంధం రాయించుకున్నది. తాపం చల్లబడింది.
ఉగ్ర నరసింహుడికి కూడా కోపం ఎక్కువ. ఆయనకూ ఆ కోపం చల్లబరచడానికి, చందనసేవ
చేస్తూ వుంటారు. అన్నాచెల్లెళ్ల కోపతాపాలను ఈ చందన లేపనం చల్లబరుస్తూ ఉంటుంది.
గంధపు చెక్కని సాన మీద అరగదీస్తే, చందన ద్రవం వస్తుంది.
ఆ చందన ద్రవానికి కుంకుమపువ్వు కలిపితే అది మరింత త్వరగా తాపాన్ని తగ్గిస్తుంది.
ఆ ద్రవాన్ని అమ్మవారు అంగములంతా రాచుకుని, శాంతంగా వున్నది అని ఈ నామానికి అర్ధం.
అమ్మవారిని అలుముకున్న ఆ చందనము, ఆ చందనవృక్షము ఎంత పుణ్యం చేసుకున్నాయో.
శరీరమంతా చందనం పూతతో శోభిల్లుతున్న, ఆ చందన ద్రవ దిగ్ధాంగి కి వందనం.
ఓం శ్రీ చందనద్రవదిగ్ధాంగ్యై నమః
ఓం శ్రీ చాంపేయకుసుమప్రియాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి