శ్రీ ద్రోణంరాజు వేంకట శ్రీరామచంద్రమూర్తి గారి అభిప్రాయం
ఒక ఆలోచన వీచిక...
మా ఊరి గురించో, విహార, సంసార, వివరాల గురించో రాయాలంటే కావాల్సింది ఆలోచన.. వివేచన.. అవగాహన.
చిరు ప్రాయం నుంచే ఆ జిజ్ఞాస - దానికి ప్రోత్సాహం లభించడం విశేషం. సాధు సత్సంగం లో పాల్గొనడం - పండిత సభల్లో సమావేశాల్లో ప్రత్యక్ష గ్రాహ్యత తో పాటు నండూరి - నందివాడ కుటుంబ జీన్స్ (వంశీ కృతం) లీలా మాత్రంగా కలిసి వచ్చాయి అనుకోవాలి.
ఆ తర్వాత బోధనా వ్యాసంగం ఎలాగూ ఉన్నదే!!
వీటితో పాటు ఏదో రాయాలన్న ప్రగాఢ కాంక్ష, వేద సాహిత్యం సంస్కృత ప్రవేశాల కలయికతో పాటు సాక్షాత్ అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి - అందుకే సరైన భావ గాంభీర్యంతో లాలిత్యంతో హృదయ స్పందనతో అక్షరరూపంగా వెలసినది ఈ "లలితా సహస్రనామ సరళమైన వ్యాఖ్యానం".
ఇది భట్టిప్రోలు వారి సహకారంతో నందివాడ విజయలక్ష్మీ ఆచరించిన శ్రీ లలితా మహా యజ్ఞం. ఈమెతో కుటుంబం అంతా ధన్యం.
శుభం భూయత్!! 🙏
******
------ ద్రోణంరాజు వేంకట శ్రీరామచంద్ర మూర్తి
అంకుల్,
రిప్లయితొలగించండినమస్తే. మీరు వ్రాసిన అభిప్రాయం, నాకు ఆశీర్వచనం లాగా అనిపిస్తోంది.
Thank you very much for the opinion.
🙏🙏🙏